గ్రేటర్లో వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంతో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలను సైతం పెద్ద ఎత్తున పెంచారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, వైద్యవిధాన పరిషత్లోని అన్ని ఏరియా దవాఖానలు తదితర వాటితో పాటు ప్రైవేటు దవాఖానల్లో సైతం కరోనా టీకా వేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 310 కేంద్రాల్లో కరోనా టీకా వేస్తుండగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే 175 కేంద్రాల్లో కరోనా టీకా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా కరోనా పరీక్షలు సైతం అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో జరుపుతున్నారు. సోమవారం గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 17,200మందికి కరోనా టీకా పంపిణీ చేయగా 13,500మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వైరస్ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చలరిస్తున్నారు.