హైదరాబాద్ : నగర శివార్లలోని గండిపేట సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఓ యువకుడు పీకల దాకా మద్యం సేవించి వాహనం నడిపి.. ఇద్దరు దంపతుల ప్రాణాలను బలిగొన్నాడు. సీబీఐటీ కాలేజీ వద్ద బైక్పై వెళ్తున్న దంపతులను సంజీవ్ అనే వ్యక్తి తన కారుతో ఢీకొట్టాడు. దీంతో ఆ దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సంజీవ్ను అదుపులోకి తీసుకున్నారు. సంజీవ్కు పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించగా, 148గా నమోదైంది. మృతులను కోకాపేటకు చెందిన రాజు, మౌనికగా పోలీసులు గుర్తించారు. దంపతులు వెళ్తున్న బైక్ నంబర్ – టీఎస్ 07 ఈజడ్ 6395.
బంజారాహిల్స్లోని రోడ్ నంబర్-2లో ఆదివారం రాత్రి అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. రోహిత్ అనే యువకుడు మద్యం మత్తులో కారు నడిపాడు. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులను ఢీకొట్టడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. రోహిత్తో పాటు కారులో ఉన్న సుమన్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్ అతిగా మద్యం సేవించి, డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.