హైదరాబాద్: నగరంలోని లంగర్హౌస్లో విషాదం చోటుచేసుకున్నది. బాత్రూంలో గీజర్ (Geyser) పేలి నవదంపతులు మృతిచెందారు. లంగర్హౌస్లోని ఖాదర్భాగ్కు చెందిన డాక్టర్ ఉమ్మాయ్ మెహిమాన్ సాహిమ, డాక్టర్ నిసారుద్దీన్ భార్యాభర్తలు. వీరికి రెండు నెలల క్రితమే వివాహమయింది. నిసారుద్దీన్ సూర్యాపేటలోని ప్రభుత్వ దవాఖానలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు.
కాగా, షార్ట్సర్క్యూట్ కారణంగా బాత్రూమ్లో ఉన్న గీజర్ పేలడంతో ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.