అల్లాపూర్,మార్చి15: అల్లాపూర్ డివిజన్ను మునుపెన్నడూ లేనివిధంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో అభివృద్ధి పరిచామని కార్పొరేటర్ సబీహాబేగం అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని వివేకానందనగర్లో జరుగుతున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను అధికారులతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాగుల సత్యం, రోణంకి జగన్నాథం, రవీందర్రెడ్డి, ఆవుల సంజీవ, మస్తాన్రెడ్డి, పర్వీన్, ప్రభాకర్ పాల్గొన్నారు.