సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శానిటేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్పై అధ్యయనం చేసేందుకు నగరానికి వచ్చారు. జవహర్నగర్ డంపింగ్యార్డు, శానిటేషన్ను పరిశీలించారు. ఇందులోభాగంగానే సోమవారం ఈ లక్నో బృందం మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది.
శానిటేషన్, సీ అండ్ డీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలుపై మేయర్ నుంచి వారు వివరాలు అడిగి తెలుసుకున్నది. ఇక్కడి శానిటేషన్ విధానాలు బాగున్నాయని కితాబిచ్చింది. ఈ బృందంలో లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుష్మ, కార్పొరేటర్లు (ఎగ్జిక్యూటివ్ మెంబర్స్) సుశీల్కుమార్, సౌరవ్ సింగ్, శైలేంద్ర వర్మ, ముఖే సింగ్, సురేంద్ర, వాల్మీకి, కమల్ సక్సేనా, హరిశ్చంద్ర, కన్నా జియా, ఉమేశ్ సాన్వాల్, ఎస్ఈ కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.