గౌతంనగర్, నవంబర్ 8 : ప్రజల ఆరోగ్యంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఓల్డ్ సఫిల్గూడ ప్రాంతానికి చెందిన నాగరాజు గత కొన్ని నెలల నుంచి పక్క వెనుక భాగానికి చెందిన ఎముకల వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య ఖర్చుల కోసం ఎమ్మెల్యే రూ.2లక్షల 50వేల ఎల్వోసీ పత్రాన్ని నాగరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించి వారికి భోరోసా కల్పిస్తున్నారన్నారు.
మైనంపల్లి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో కూడ పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నామన్నారు. వైద్య ఖర్చులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పుష్కలంగా నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఎవరైనా అనారోగ్యం పాలైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వపరంగా వైద్యం అందించి తన వంతు సహకారాన్ని అందజేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, జీఎన్వీ సతీశ్కుమార్, పిట్ల శ్రీనివాస్, ఎం.భాగ్యనందరావు, మౌలాలి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్తయ్య, భరత్నగర్ కాలనీ అధ్యక్షుడు మంద భాస్కర్, గౌలికార్ శైలేందర్, సంతోష్నాయుడు, గౌలికార్ దినేశ్, చందు, మోహన్రెడ్డి, సంతోష్రాందాస్, సందీప్గౌడ్, రఘుయాదవ్, కన్న(గణేశ్ముదిరాజ్), ఎస్కే.బాబా, ఇబ్రహీం, షకీల్ తదితరులు ఉన్నారు.