ఎల్బీనగర్ : ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్ది విద్యార్థులకు ఉత్తమ భోధన అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త అన్నారు. సోమవారం కొత్తపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల నిర్వాహణ కమిటీ సమావేశం, కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త ముఖ్యఅతిథిగా హజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ మన ఊరు , మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలకు మహర్థశ పట్టనున్నదని అన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణలో విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్గౌడ్, సీనియర్ నాయకులు బొగ్గారపు శరత్, బొగ్గారపు వరుణ్, అశోక్జైన్, బాబు, శ్రీకాంత్, ప్రాథమిక పాఠశాల హెడ్మస్టర్ పద్మారావు, హైస్కూల్ హెడ్మస్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.