సైదాబాద్, అక్టోబర్ 2: సైదాబాద్ సింగరేణికాలనీ గుడిసెల్లో శనివారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నగర జాయింట్ కమిషనర్ (ఈస్ట్జోన్ డీసీపీ) రమేశ్ ఆధ్వర్యంలో 200 మంది సిబ్బంది కాలనీని జల్లెడపట్టారు. బృందాలుగా వీడిపోయి క్షుణ్ణంగా సోదాలు చేశారు. మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ రమేశ్ మాట్లాడుతూ సింగరేణి కాలనీ మద్యానికి కేంద్రంగా మారిందన్నారు. 20 మందిని బైండోవర్ చేశామని, మరో 30 మందిపై కేసులు కొనసాగుతున్నాయని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్, రౌడీ షీట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.