సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బెంగళూరు కేంద్రంగా.. నగరంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర డ్రగ్ వ్యాపారిని పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.1.20లక్షల విలువ చేసే 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన శివ్రాంపూర్ బాబు కిరణ్ (26) కారు డ్రైవర్. వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది.
దీనికి తోడు డ్రగ్స్కు బానిసయ్యాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన డ్రగ్స్ వ్యాపారి దినకరణ్కు దగ్గరయ్యాడు. సులువుగా డబ్బు సంపాదించాలని భావించిన కిరణ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూనే.. డ్రగ్స్ విక్రయించే దినకరణ్ సూచన మేరకు హైదరాబాద్లో మత్తు పదార్థాలు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే దినకరన్ వద్ద నుంచి రూ.6వేలకు ఒక గ్రాము చొప్పున ఎండీఎంఏ డ్రగ్ను కొనుగోలు చేశాడు. శుక్రవారం ఫిల్మ్నగర్ మూన్షైన్ పబ్ వద్ద విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. సమాచారం అందుకున్న పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు.. ఫిల్మ్నగర్ పోలీసులతో కలిసి నిందితుడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.1.20 లక్షలు విలువజేసే 20 గ్రాముల ఎండీఎంఏ, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ఫిల్మ్నగర్ పోలీసులకు అప్పగించారు. టాస్క్ఫోర్స్ డీసీపీ శ్రీబాల పర్యవేక్షణలో ఛేదించిన ఈ కేసు దర్యాప్తులో ఇన్స్పెక్టర్ ఖలీల్పాషా, ఫిల్మ్నగర్ ఎస్హెచ్ఓ ఎంజీఎస్.కృష్ణ, ఎస్ఐ షేక్ కవ్వుద్దీన్ పాల్గొన్నారు.