బండ్లగూడ: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మేయర్ మహేందర్గౌడ్ పేర్కొన్నారు.కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ పద్మశ్రీ హిల్స్ కాలనీలో నూతనంగా నిర్మించ తల పెట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ పద్మవతి పాపయ్య యాదవ్తో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా మేయర్ మహేందర్గౌడ్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో దశల వారిగా అభివృద్ది పనులను చేపడుతున్నామని తెలిపారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్పొరేటర్ పద్మవతి పాపయ్య యాదవ్ మాట్లాడుతూ ఏడవ డివిజన్లో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజల సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పెన్సల్రెడ్డి,ఉపాధ్యక్షులు కిషోర్,ప్రధాన కార్యదర్శి విక్రమం కుమార్.తదితరులు పాల్గొన్నారు.