కలుషిత తాగునీటి సమస్యలు, మురుగునీటి ఇబ్బందులను తొలగించటానికి అధికారులు కృషి చేయాలని సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ అన్నారు. శనివారం ఆస్మాన్ఘడ్, మాధవనగర్ కాలనీల్లో డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. మాదవనగర్కాలనీ, ఆస్మాన్ఘడ్ టీవీ టవర్ ప్రాంతాల్లో కలుషిత తాగునీరు సరఫరా కావటంతో స్థానికులు వ ఇబ్బందులు పడుతున్నారన్నారు. జలమండలి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వరదనీటి కాల్వ పూడికతీత పనులను కొనసాగిస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో పూడికను తీయాలని, తీసిన పూడికను తక్షణమే తొలగించాలని సిబ్బందిని ఆదేశించామని తెలిపారు. కార్యక్రమంలో ఆస్మాన్ఘడ్ జలమండలి మేనేజర్ అల్తాప్, జావీద్, యాదగిరి, మహ్మద్ మోహినుద్దీన్ పాల్గొన్నారు.
– సైదాబాద్, మే 7