కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 12: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దూలపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు నిర్మాణ పనులు రాకపోకలకు వీలుగా పూర్తయ్యాయి. ఎన్హెచ్-44 జాతీయ రహదారి, నర్సాపూర్ రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉన్న ఈ మార్గం గుండా నిత్యం వందలాది సంఖ్యలో వాహనాలు వస్తూపోతుంటాయి. ప్రధానంగా ఈ ప్రాం తంలో వివిధ రకాల పరిశ్రమలు అధికంగా ఉండడంతో పాటు సుదూరాన్ని దగ్గర చేసే మార్గం ఇదొక్కటే. కానీ వర్షాకాలం వస్తే ఆ మార్గం గుండా వెళ్లాలంటే అక్కడి జనాలకు, వాహనదారులకు, పెద్దపెద్ద వాహనదారులకు కష్టాలు తప్పేవి కాదు. మార్గమధ్యలో పూరాతనమైన కల్వర్టు ఉండడంతో నాటి పాలకులు దీనిని అభివృద్ధి చేయకపోవడం మూలంగా పెరిగిన అవసరానికి ఆనుగుణంగా కల్వర్టు తట్టుకోలేకపోయింది. ఫలితంగా గత ఏడాది కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి వచ్చే నాలా ఉధృతి పెరిగి గత ఏడాది కల్వర్టు కూలి.. రహదారి పూర్తిగా విచ్ఛిన్నంగా మారింది. దీంతో నిత్యం వందల సంఖ్యలో వచ్చిపోయే వాహనాలకు, ఊరు దాటేందుకు దాటలకునునే గ్రామస్తులు, ఇతర ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పట్టుదలతో రాకపోకలకు అనుగుణంగా పనులు పూర్తి చేయడం పట్ల ప్రయాణీకులు, వాహనదారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టు కూలకముందే ఈ మార్గంలో వెళ్లాలంటే విచ్చిన్నంగా మారిన రోడ్డుపై వరద నీరుతో రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఉండేది. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో అతికష్ట సమయం లో ఈ మార్గం గుండా ప్రజలను, వాహనదారులను దాటించేందుకు నానా ప్రయత్నాలు జరిగేవి. దాదాపుగా వారం రోజుల పాటు వరద ఉధృతి ఉండేది.
ప్రతి ఏటా వర్షాలు పడిన సమయంలో ఆ మార్గం గుండా వెళ్లాలంటే విద్యార్థులు, వాహనదారులు నానా అవస్థలు పడేవారు. వారి ఇబ్బందులను అధిగమించేందుకు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రత్యేక దృష్టిని సారించారు. దూలపల్లి గ్రామం నుంచి కొంపల్లి రహదారి దూలపల్లిటి జంక్షన్ వరకు రోడ్డు వెడల్పు పనులను హెచ్ఎండీఏకు అప్పగించారు. అదే సమయంలో ప్రత్యేకంగా మార్గమధ్యలో ఉన్న కల్వర్టు శాశ్వత నిర్మాణం కోసం అపర్ణఫామ్గ్రోస్ సెప్టిక్ట్యాంకు నుంచి దూలపల్లి కల్వర్టు, అశోక అలామీషన్ మార్గంలో నాలా వెడల్పుతో పాటు ఆర్సీసీ పైపులైన్ నిర్మాణం కోసం రూ.మూడు కోట్ల వ్యయాన్ని వెచ్చించారు. ఈ మార్గం గుండా రెండు వైపు లా కల్వర్టు, రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో దాదాపుగా ఏడు నెలల కాలంలోనే కల్వర్టు నిర్మాణంతో పాటు ఒకవైపు రోడ్డును సైతం పూర్తి చేసి రాకపోకలకు సులువుగా సాగేలా పనులు పూర్తి చేశారు. మరోవైపు సాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను వర్షాలు తగ్గాక పూర్తి చేసేలా అధికారులు సిద్ధంగా ఉన్నారు.
నిత్యం వందల సంఖ్యలో వాహనదారులకు, విద్యార్థులకు, ప్రజలకు ఈ మార్గం రద్దీగా ఉండేది. వర్షాకాలంలో ఇక్కడ ప్రజలకు ఎదురయ్యే సమస్యను రాష్ట్ర పురపాలిక శాఖామంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే కల్వర్టు నిర్మాణంతో పాటు భవిష్యత్లో ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు వెడల్పు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించడంతో కల్వర్టును యుద్ధప్రాతిపదిక పూర్తి చేసుకున్నాం. అభివృద్ధికి సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– కేపీ వివేకానంద్, ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్