ఉప్పల్, నవంబర్ 26: దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ సేవలు ఆదర్శనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం హబ్సీగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, రామంతాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎండీ.ముస్తాక్, నాచారం డివిజన్ అధ్యక్షుడు మేకల ముత్యంరెడ్డి, సుడుగు మహేందర్రెడ్డి, గిల్బర్ట్, చంద్రారెడ్డి, పిట్టల నరేశ్, తిప్పని సంపత్కుమార్, అబ్బుబాయి పాల్గొన్నారు.
నాచారం డివిజన్ వార్డు కార్యాలయంలో
రాజ్యాంగ దినోత్సవాన్ని కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అంజి, బీసీసెల్ అధ్యక్షుడు విఠల్యాదవ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు రెబల్ రాజు, ఎస్టీసెల్ అధ్యక్షుడు పాండునాయక్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, రాంచందర్, కట్ట బుచ్చన్న, శ్రీరామ్ సత్యనారాయణ, సువర్ణ సుగుణాకర్రావు, రవీందర్రెడ్డి, రాజు, గణేశ్, మారయ్య, తుంగ తిరుపతి పాల్గొన్నారు.
మల్లాపూర్లో
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మల్లాపూర్ అంబేద్కర్ భవనంలో జ్ఞాన ప్రచార సభ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, జ్ఞాన ప్రచార సభ వ్యవస్థాపకుడు నల్ల బాబులు హాజరయ్యారు. కార్యక్రమంలో అఖిల భారతీయ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకుడు పీవీ.రమణ, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పర్నాటి నరేందర్, నాయకులు పాల్గొన్నారు.
బీజేఆర్ కాలనీలో..
అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఉప్పల్ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు తాడూరి గగన్కుమార్, బీజేఆర్ కాలనీ అధ్యక్షుడు ఎస్ఏ.రహీం తెలిపారు. ఏఎస్రావునగర్ డివిజన్లోని బీజేఆర్ నగర్లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహాచారి, ఉపేందర్రావు, నరేందర్రావు, రవినాయక్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.