శేరిలింగంపల్లి, డిసెంబర్ 30: ఐటీ కారిడార్ హస్టల్స్ అసోసియేషన్ సభ్యులకు ఎల్లవేలలా రుణపడి ఉంటానని, నియోజకవర్గంలోని అన్ని కాలనీల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకువెళ్తానని స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సుందరయ్య విజ్ఞన కేంద్రంలో ఐటీ కారిడార్ హస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ‘ఆత్మీయ అభినందన సభ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ… ముచ్చటగా మూడవసారి భారీ మెజార్టీతో గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేలలా రుణపడి ఉంటానని, నాపై విశ్వాసంతో గెలిపించినందుకు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, కార్పొరేటర్లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్యెల్యే గాంధీకి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ కారిడార్ హస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, జనరల్ సెక్రటరీ కరుణాకర్, ట్రెజరర్ మహేందర్, సభ్యులు నాగిరెడ్డి, సంజయ్, మధు, వేణు, చంద్రశేఖర్, రఘు తదితరులు ఉన్నారు.