వెంగళరావునగర్ : ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న జె.వి.నాగేశ్వర్రావు(50) అనే కానిస్టేబుల్ గుండె పోటుతో శనివారం హఠాన్మరణం చెందారు. 1995 బ్యాచ్కు చెందిన నాగేశ్వర్రావు పోలీసు స్టేషన్లోని క్రైం విభాగంలో పనిచేస్తున్నారు.
ఓల్డ్ అల్వాల్లోని సిటిజన్ కాలనీలో ఉంటున్న నాగేశ్వర్రావు గుండె పోటుతో కుప్పకూలి పోవడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు అతన్ని సుచిత్ర సమీపంలోని రెనోవా దవాఖానాకు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నాగేశ్వర్రావుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
నాగేశ్వర్రావు మరణం పట్ల పంజాగుట్ట ఏసీపీ గణేష్, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, డీఐ రాంప్రసాద్, ఇతర సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కానిస్టేబుల్ నాగేశ్వర్రావు పోలీసు శాఖ కు విశేషమైన సేవలు అందించారని అధికారులు కొనియాడారు.