సుల్తాన్బజార్, జనవరి 12 : ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య విబేధాలు సృష్టించేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని, ఇటీవల వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, భాగ్యనగర్ తెలంగాణ గచ్చిబౌలి హౌజింగ్ సొసైటీ సభ్యులెవరూ ఆందోళన చెందవద్దని సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారా యణగౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్పై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. బుధవారం గన్ఫౌండ్రీలోని బీటీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. గోపన్పల్లిలోని సర్వే నంబర్ 36లోని 142 ఎకరాల 15 గుంటల స్థలాన్ని ఏపీఎన్జీవో నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం బీటీఎన్జీవోగా మార్చారన్నారు. ఈ స్థలాన్ని బీటీ ఎన్జీవో సభ్యులకు కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. అయితే ఇటీవల ఓ పత్రికలో గోపన్పల్లిలోని సర్వే నంబర్ 36, 37లోని ప్రభుత్వ భూమిని మై హోంకు కేటాయిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని తెలిపారు. కేవలం ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య విబేధాలు సృష్టించేందుకు చేస్తున్న కుట్రలేనని మండిపడ్డారు. త్వరలోనే రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఉద్యోగ జాక్ చైర్మన్ మామిళ్ల రాజేందర్, జాక్ ప్రధాన కార్యదర్శి వి.మమత, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రతినిధులు రాయకంటి ప్రతాప్లతో కలిసి సీఎం కేసీఆర్ను కలిసి సొసైటీలో ఉన్న 3వేల మంది సభ్యులకు సొసైటీ స్థలంలో ప్లాట్లు ఇప్పించేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి జి.మల్లారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్రావు, కోశాధికారి శ్రీనివాస్, డైరెక్టర్ శ్రీనివాస్రావు, సభ్యులు రాజు పాల్గొన్నారు.