ఉప్పల్, నవంబర్ 5 : ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలం పెరుగుతోంది. వివిధ పార్టీల నుంచి నేతలు, కార్యకర్తల చేరికల జోరు కొనసాగుతోంది. వందల సంఖ్యలో యువకులు, మహిళలు, సబ్బండ వర్గాల చేరికలతో బీఆర్ఎస్కు నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. దీనితో గులాబీ శ్రేణులు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. హబ్సిగూడలోని కార్యాలయంలో చిలుకానగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజ్యలక్ష్మి, బీరప్పగడ్డకు చెందిన షబ్బీర్ అలీ, బొడ్డు రవీందర్, బొడ్డు రాఘవేంద్రతో పాటు వందలాది మంది యువకులు ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్జీఆర్ఐ ఆటోస్టాండ్ యూనియన్ అధ్యక్షుడు కిషన్ నాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్, ఉపాధ్యక్షులు సాంబ, రవినాయక్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డా.బీవీ.చారి, కాలేరు జైనవీన్, సోమిరెడ్డి, లింగానాయక్, రవినాయక్, తదితరులు పాల్గొన్నారు.
హబ్సిగూడ సాయిసుఖ విస్తాస్లో సమావేశం..
హబ్సిగూడలోని సాయిసుఖ విస్తాస్లో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రసంగించారు. కాలనీలు, అపార్ట్మెంట్వాసులకు అండగా ఉంటానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచి, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కాలనీవాసులు పాల్గొన్నారు.