మన్సూరాబాద్ : నాయిబ్రాహ్మణ కులస్తుడైన మేకప్మెన్ నాగశ్రీనును కులంపేరుతో దుర్భాషలాడిన సినీనటుడు మోహన్బాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలక్రిష్ణ నాయి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ సీఐ అశోక్రెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా రాసమల్ల బాలక్రిష్ణ నాయి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నాగశ్రీను సినీనటుడు మోహన్బాబు వద్ద పని చేస్తున్నాడని తెలిపారు. చిన్న విషయానికి నాగశ్రీనును కులం పేరుతో దూషించడమే కాకుండా అతడి తల్లిని దుర్భాషలాడాడని తెలిపారు.
మోకాళ్లపై కూర్చోబెట్టి అవమానించిన సినీనటుడు మోహన్బాబుపై వెంటనే కేసు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంబర్తి శ్రీనివాసరావు నాయి, ఉపాధ్యక్షులు రమేష్నాయి, రాజు నాయి, విద్యాసాగర్ నాయి, వేలాద్రి నాయి తదితరులు పాల్గొన్నారు.