GHMC | సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో ఫేక్ ఫింగర్ ప్రింట్ల వ్యవహారంపై కమిషనర్ రోనాల్డ్ రాస్ సీరియస్ అయ్యారు. రెండు రోజుల కిందట వెలుగు చూసిన ఈ వ్యవహారంపై అంబర్పేట మెడికల్ ఆఫీసర్ జ్యోతిబాయ్పై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోయారంటూ.. సస్పెండ్ చేస్తానంటూ మందలించారు.
ఈ నేపథ్యంలోనే జ్యోతిబాయ్ను మాతృసంస్థకు బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అంబర్పేటలో నకిలీ ఫింగర్ ప్రింట్లు కలిగిన 11 మంది కార్మికులు, ఇద్దరు ఎస్ఎఫ్ఏలు, శేరిలింగంపల్లిలో ముగ్గురు ఎస్ఎఫ్ఏలను కమిషనర్ విధుల నుంచి తొలగించారు.