ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి
ఉప్పల్/కాప్రా/మల్లాపూర్/రామంతాపూర్/చర్లపల్లి, జూన్ 8 : కాలనీల అభివృద్ధికి పట్టణ ప్రగతి దోహదం చేస్తుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. హబ్సిగూడ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పాల్గొని చెత్త తొలగింపు పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అరుణాకుమారీ, ఈఈ నాగేందర్, డీఈ నాగమణి, ఏఈ కీర్తి, ఎంటమాలజీ అధికారులు రజనీ, నరేశ్రెడ్డి, టౌన్ప్లానింగ్ టీపీఎస్ మౌనిక, డీఈ చందన, విద్యుత్ అధికారులు రవీందర్రెడ్డి, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, బీవీ చారి, కంచర్ల సోమిరెడ్డి, గరకి సుధాకర్, లక్ష్మీనారాయణ, వెల్లంకి రవీందర్రెడ్డి, రవినాయక్, దాచేపల్లి శ్రీధర్, జేసీబీ.రాజు, అద్వైత్రెడ్డి, గణేశ్, నాని, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. నాచా రం డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ హాజరయ్యారు. చిలుకానగర్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు.
రోడ్లను తవ్వితే సహించేది లేదు..
కాప్రా : కాలనీ అప్రోచ్రోడ్లను తవ్వుతూ కాలనీవాసుల రాకపోకలకు ఇబ్బందులు కలుగజేస్తే సహించేది లేదని కాప్రాడివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధ వారం డివిజన్ పరిధిలోని చంద్రపురి, ఎక్స్టెన్షన్, శ్రీరాంనగర్ కాలనీల్లో ఈఈ హరిలాల్, ఏఎంఓహెచ్ డాక్టర్ స్వప్నారెడ్డి, ఏఈఈ అభిషేక్తో కలిసి ఆయన పర్యటించారు. కొత్తగా ఏర్పడిన చంద్రపురి ఎక్స్టెన్షన్కాలనీ అప్రోచ్రోడ్డును కొంతమంది కావాలని తవ్వుతూ రాక పోకలకు అడ్డంకులు సృష్టిస్తున్నారనీ కార్పొరేటర్కు ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకోవాలని ఈఈ హరిలాల్, టీపీఎస్ సరితాసేన్ను కోరారు. డివిజన్ టీఆర్ఎస్ కార్యదర్శి గిల్బర్ట్, పవన్, భిక్షపతి, కుమా ర్, మచ్చ పాండు, ఎండీ అలీ, చందు, రా య్, శివలింగం, చోటుభాయ్, ప్రదీప్, గణేశ్ పాల్గొన్నారు.
మల్లాపూర్, మీర్పేట్ డివిజన్లలో..
మల్లాపూర్ : మల్లాపూర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్రవంతి, టీఆర్ఎస్ నాయకులు కిరణ్కుమార్రెడ్డి, వాసుగౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్లో..
శాంతినగర్, నర్సింహనగర్ కాలనీలలో కార్పొరేటర్ జెర్రి పోతుల ప్రభుదాస్ అధికారులతో కలిసి పర్యటించి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాజీ కార్పొరేటర్ జి. శ్రీనివాస్రెడ్డి, ఏఈ రాకేశ్, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, కాలనీ సంక్షేమ సంఘం నా యకులు ఎనుముల మహేశ్కుమార్, మధు, రాకేశ్, వేణు, శ్యామ్, రమేశ్ రాథోడ్, శేఖర్ పాల్గొన్నారు.
అధికారుల పర్యటన..
రామంతాపూర్ : రామంతాపూర్ డివిజన్ పరిధిలోని ఆనంద్నగర్, భరత్నగర్ తదితర ప్రాంతాల్లో బుధవారం అధికారులు పర్యటించారు. నోడల్ అధికారి వెంకటరమణ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఏఈ ప్రభాకర్రెడ్డి, జ్యోతి, కిషన్, కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.
మీనాక్షినగర్, శివసాయినగర్లలో..
చర్లపల్లి : మీనాక్షినగర్, శివసాయినగర్లలో కాలనీ సంక్షేమ సంఘం నాయకులు స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధి ఎంపెల్లి పద్మారెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సురేశ్గుప్తా, బర్ల రాంచందర్రెడ్డి, నారా నర్సింహులు, వనం విజయ్కుమార్, పులి రాందాస్లతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.
కాప్రాలో మొక్కలతో కార్పొరేటర్ స్వర్ణరాజు తదితరులు
చిలుకానగర్లో పాదయాత్ర చేస్తున్న కార్పొరేటర్ గీతాముదిరాజ్