మేడ్చల్, జూలై 22 (నమస్తే తెలంగాణ): నూతన ఆవిష్కరణల ద్వారా సృజనాత్మకను వెలికితీసే ఇంటింటా ఇన్నోవేషన్స్కు దరఖాస్తులను ప్రజల నుంచి ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలలోని సృజనాత్మకను వెలికితీసి వారిని ప్రోత్సహించి నూతన ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు ప్రత్యేక కార్యాచరణ నిర్వహిస్తుందన్నారు. కొవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఈ నెల 25వ తేదీలోపు వాట్సాప్ నం: 91006 78543 పంపిచాలని కోరారు. జిల్లా ప్రజలు, విద్యార్థులు, విద్యావంతులు, గృహిణులు, వివిధ వృత్తులవారు ఎవరైనా ఇందుకు అర్హులేనని అన్నారు. ఆవిష్కరణలకు సంబంధించి ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియో, ఆవిష్కరణ నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నంబర్, వయస్సు, వృతి, గ్రామం తదితర వివరాలను వాటానంబర్కు పంపించాలని కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు. ఇందులో నుంచి ఐదు ఆవిష్కరణలను ఎంపి క చేసి ఆగస్టు 15న ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు విద్యావేత్తలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి ఫోన్ నంబర్ 84405 07584 సంప్రందించాలన్నారు.