సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 30న మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని లంగర్హౌజ్లోని బాపూఘాట్ వద్ద ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గాంధీ వర్ధంతి ఏర్పాట్లపై జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారితోపాటు ఇతర అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మునికి నివాళులర్పించేందుకు గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు వస్తారని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యప్రకాశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.