సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): చలి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో నగరంలో చలిపులి పంజా విసురుతోంది.
శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13.2 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27.2 డిగ్రీలు, గాలిలో తేమ 52శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.