హైదరాబాద్ : మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన చలి మళ్లీ వణుకు పుట్టిస్తోంది. గత మూడు నాలుగు రోజులుగా సాధారణ స్థాయి దాటి నమోదైన రాత్రి ఉష్ణోగ్రతలు సోమవారం ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో మళ్లీ చలి వణుకు పుట్టిస్తోంది. తీవ్రమైన చలి ఉండటంతో నగర వాసులు పొద్దున్నే బయటకు రావాలంటేనే వణుకుతున్నారు. పిల్లలు, వృద్ధులు చలిని తట్టుకోలేక వెచ్చగా ఉండే ప్రాంతాలకే పరిమితమవుతున్నారు.
గత మూడు రోజులుగా 21.0, 20.2, 21.0 డిగ్రీలుగా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు సోమవారం నాటికి భారీగా పడిపోయి 16.7 డిగ్రీలుగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 30.6డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 35శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నగరంలోని వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.