గోల్నాక, ఆగస్టు 12 : అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం గోల్నాకలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోల్నాక డివిజన్ ఖాద్రీబాగ్కు చెందిన సయ్యద్నదీం అహ్మద్కు రూ.2 లక్షలు, గోల్నాక జిందాతిలస్మాత్ కాలనీకి చెందిన జోసఫ్కు రూ. 60వేలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందన్నారు. సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంలా మారిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.