మారేడ్పల్లి, మే 23 : గౌతమ బుద్ధుడి సూచనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కంటోన్మెంట్లోని మహేంద్రహిల్స్లో నిర్వహించిన బుద్ధ పూర్ణిమ జయంతి వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. బుద్ధ భవన్ నిర్మాణానికి, నిర్వహణకు గత ముఖ్య మంత్రులు విజయ్ భాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏ విధంగా సహకరించారో..
ఇప్పుడు కూడా ప్రత్యేక నిధులు కేటాయించి ధ్యాన మందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బుద్ధ భవన్లో పాఠశాల నిర్మాణం చేపడితే బాగుటుందని సూచన చేశారు. అదనపు డీజీపీ శివధర్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, మహభోది సంఘ నేతలు శేఖర్, చేతన్, బుద్ధ పాల, సీనియర్ నాయకులు శ్రీ గణేశ్, సీతారాం రెడ్డి, సంజీవ రెడ్డి, పాల్గొన్నారు.