సికింద్రాబాద్ : పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ తెలిపారు. మంగళవారం సీతాఫల్మండిలోని క్యాంపు కార్యాలయంలో ఇద్దరు లబ్దిదారులకు రూ.3లక్షల విలువజేసే ఎల్వోసీ పత్రాలను అందజేశారు.
అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన నాగరాజుకు రూ.1.5లక్షలు, చిలకలగూడకు చెందిన నస్రీన్కు రూ.1.5లక్షల చొప్పున విలువైన ఎల్వోసీలను అందించారు. కార్యక్రమంలో నేతలు త్రినేత్రగౌడ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.