అహ్మదాబాద్: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 167 పరుగుల ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు చుక్కులు చూపించిన యువ బ్యాట్స్మన్ పృథ్వీ షా(39) హర్ప్రీత్ బౌలింగ్లో వెనుదిరిగాడు. తొలి వికెట్కు 63 పరుగులు జోడించారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టును లక్ష్యం దిశగా నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ధావన్(24), స్మిత్(9) క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లకు ఢిల్లీ వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి ఇంకా 72 బంతుల్లో 93 పరుగులు చేయాల్సి ఉంది.