సికింద్రాబాద్, జనవరి 17: సీఎం సహాయనిధి పేదలకు వరంగా మారిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సోమవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఎల్వోసీని లబ్ధిదారు కుటుంబ సభ్యులకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న అందజేశారు. బోర్డు పరిధిలోని ఐదో వార్డు సంజీవయ్య వీకర్ సెక్షన్కు చెందిన శంకరాచారి గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే సాయన్నను సంప్రదించగా వారు సీఎం సహాయనిధి నిధికి దరఖాస్తు చేయించారు. దీంతో సీఎం సహాయనిధి నుంచి శంకరాచారికి సుమారు రూ.2లక్షలను మంజూరు చేస్తు ఎల్వోసీ చెక్కును జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంజూరైన పత్రాన్ని లబ్ధిదారు కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్నహస్తంలా ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు నివేదిత, పిట్ల నగేష్, సదానంద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పేర్కొన్నారు.ఈ మేరకు సోమవారం నామాలగుండులోని తన క్యాంపు కార్యాలయంలో సీతాఫల్మండి డివిజన్కు చెందిన పద్మజకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన సుమారు రూ.1లక్ష విలువ చేసే ఎల్వోసీని వారి కుటుంబ సభ్యులకు డిప్యూటీ స్పీకర్ అందజేశారు.