కీసర/ఘట్కేసర్,నవంబర్24:ముస్లింల సంక్షేమానికి గత తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం ఘట్కేసర్,కీసర మండలం యాద్గార్పల్లిలోని శుభం గార్డెన్లో ముస్లింల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు.
దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ముస్లింల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రంజాన్ పండుగకు కొత్తబట్టలు అందిం చి వారిని ఆదుకున్నారని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాలలో ముస్లింలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని వివరించారు. ముస్లింలతో పాటు, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.అభివృద్ధితో పాటు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిం చారని వివరించారు.
ప్రతిపక్షాలు ఓట్ల కోసమే పనిచేస్తాయి..
ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వచ్చే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓట్ల కోసమే పనిచేస్తాయని,బీఆర్ఎస్ మాత్రం ఎల్లప్పుడు వారి సంక్షేమం కోసం పనిచేస్తుందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ప్రజలు బీఆర్ఎస్కే ఓట్లు వేసి మరోసారి సీంఎం కేసీఆర్ను,మేడ్చల్లో నన్ను బలపర్చాలని నిర్ణయించుకున్నారని వివరించారు.ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలను సంపూర్ణంగా అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు.
ఈ ప్రాంతంలోని పోచా రం,ఘట్కేసర్ మున్సిపాలిటీలు పుర్తి స్థాయిలో అభివృద్ధిని సాధించాలన్నారు. ఇక్కడి ప్రజలకు ఏది తక్కువైనా చైర్మన్,కౌన్సిలర్లు,బీఆర్ఎస్ నాయకులు కొట్లాడి సాధించుకుంటున్నారని అన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు పడిగెం వెంకటేశ్వరావు, నాయకులు ముల్లి పావనీ జంగయ్య యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్రెడ్డి, సుధాకర్, శ్రీనివాస్ గౌడ్, హరిశంకర్, సిరాజ్, కీసర మండల కో-ఆప్షన్ సభ్యులు ఎం.డీ. బషారత్ ఆలీ, మైనార్టీలు ఎం.డీ నర్సత్, ఎం.డీ హాఫీజ్, ఎం.డీ సాజీద్, రాఫ్, ఫారీద్, ఎం.డీ. ఆరీఫ్, కార్యకర్తలు పాల్గొన్నారు.