కందుకూరు, నవంబర్ 24 : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని అక్కసుతో ప్రతి పక్షాలు అడ్డుకుంటున్నాయని, ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని 100మందికి పైగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేక మంది పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులకు మింగుడుపడటం లేదన్నారు. పార్టీలో చేరిన వారిలో రవీందర్, శేఖర్గౌడ్, రమేశ్, మంజుల, చల్ల జైపాల్రెడ్డి, నరేందర్, శంకర్, మాజీ సర్పంచ్ మహేందర్, సత్యనారాయణ, వెంకటయ్య, యాదయ్య, జయమ్మ తదితరులు ఉన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురేందర్రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, లక్ష్మీనర్సింహా రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, సర్పంచ్ సదాలక్ష్మి, మాజీ అధ్యక్షురాలు జయమ్మ, మాజీ జడ్పీటీసీ రామయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు యాదయ్య, ఎంపీటీసీ సురేశ్, ఆనంద్, పాండురంగారెడ్డి, శేఖర్ రెడ్డి, దేవీలాల్, మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, కార్తిక్ , యూత్ అధ్యక్షుడు సిద్ధేశ్వర్గౌడ్, రాజు పాల్గొన్నారు.