బండ్లగూడ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలసి కోటి 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులతో పాటు పంచతంత్ర పార్కును ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు తగినన్ని నిధులు మంజురు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్రెడ్డి, కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేష్గౌడ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.