మారేడ్పల్లి : మహిళ దినోత్సవాల్లో భాగంగా మోండా డివిజన్ మారేడ్పల్లిలోని మల్టిపర్పస్ కమ్యూనీటిహాల్లో ఆదివారం కేసీఆర్ మహిళ బంధు పేరిటి 27 మంది లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి. సాయన్న మాట్లాడుతూ…పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు.
ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు నిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా ఉన్నాయి తెలిపారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న తన సొంత నిధుల నుంచి మహిళలకు నాణ్యమైన చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యాడడు జక్కుల మహేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు టిఎన్. శ్రీనివాస్, ఆకుల హరికృష్ణ, ముప్పిడి మధుకర్, సంతోష్యాదవ్, పెద్దాల నర్సింహ్మ, శ్రీహరి, అజేయ్ ,సదానంద్గౌడ్, రాజయ్య, నారాయణ, జయప్రకాశ్, మాజీ బోర్డు సభ్యురాలు నళినికిరణ్, మహిళ నాయకురాలు నివేధిత, లాస్యనందిత తదితరులు పాల్గొన్నారు .
మోండా డివిజన్లో…
మోండా డివిజన్ సెకండ్బజార్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు ఆదివారం సందడిగా సాగాయి. ఈ సందర్భంగా జీహెచ్ఎంసి మహిళ పారిశుధ్ద్య సిబ్బందిని మాజీ కార్పొరేటర్ సత్కరించి వారికి చీరెలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, జీహెచ్ఎంసి సిబ్బంది రేణులత, స్వాతి, లక్ష్మి, సుశీల, ఎల్లమ్మ, విజయ, నర్సింగ్రావు, దశరథ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.