ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి
చర్లపల్లి, ఏప్రిల్ 3 : రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చే సేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియో జకవర్గ పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటా యించి.. పనులు చేపడుతున్నామని, ఇప్పటికే ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, హెచ్బీకాలనీ, నాచారం, ఏఎస్రావునగర్ తదితర డివిజ న్లలోని ఆలయాలను అభివృద్ధి చేశామన్నారు. మిగిలి ఉన్న ఆలయా లను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం ఆలయంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్ర మాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ పల్లె కృష్ణారెడ్డి, కార్యనిర్వాహక అధికారి వీరేశం, ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మణచార్యులు, వేణుగోపాల్చార్యులు, రామణా చార్యులు, నారాయణ చార్యులు, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, కొత్త రామారావు, చర్లపల్లి, ఏఎస్రావునగర్ డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు డప్పు గిరిబా బు, కాసం మహిపాల్రెడ్డి, సారా అనిల్, కుమారస్వామి, సీసీఎస్ ప్రతినిధి ఎంపెల్లి పద్మారెడ్డి, వేముల నర్సింహాగౌడ్, గంప కృష్ణ, వినోద్, రెడ్డినాయక్, రాధాకృష్ణ, రాకేశ్, ఉపేందర్, శ్యామ్, మల్లారెడ్డి, కృష్ణవేణి, మంజుల, తులసీ, జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవికుమార్తో పాటు భక్తులు పాల్గొన్నారు.
కాలనీల అభివృద్ధికి చర్యలు..
నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటా యించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్లోని కుషాయిగూడ, పారిశ్రామికవాడ, పద్మావతి కాలనీలో ఆయన పర్యటించి.. స్థానికులను సమస్యలను అడి గి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. వేసవిలో మంచినీటి సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అదే విధంగా కాలనీల్లోని రహదారుల నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు పారిశుధ్య పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ధన్పాల్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.