చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 19 : తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గతంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోనే వరి అధికంగా పండేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేసి ఆ రాష్ర్టాలను మించి ధాన్యం దిగుబడి వచ్చేలా చేశాడన్నారు. బుధవారం చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, గుండ్లబావి, కాట్రేవు గ్రామాల్లో మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డితో కలిసి మంత్రి మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది టీఆర్ఎస్లో చేరారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రయత్నిస్తున్నదన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనదు.. గ్యాస్, పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నదన్నారు. పాలకు సైతం ట్యాక్స్ వేస్తుందన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రావొద్దన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. సర్పంచులు మునగాల ప్రభాకర్రెడ్డి, బచ్చ రామకృష్ణ, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్యగౌడ్, ఉప సర్పంచులు మమతా మల్లేశ్యాదవ్, బోయ యాదయ్య, నందగిరి మల్లేశ్గౌడ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఏనెపల్లి ముత్యంరెడ్డి, నందగిరి శ్యామ్గౌడ్, బచ్చ మల్లేశ్ పాల్గొన్నారు.