ఉపముఖ్యమంత్రి నాకు డైలాగ్ కొడుతుండు. బస్సు పెడుతాం రా.. మేము ఐదు గంటల కరెంటు ఇస్తున్నాం.. చూసిపోదువని.. అరే బాబు.. నీకు ఎవడన్నా చెప్పిండో లేడో.. మేం 24 గంటల కరెంటు ఇస్తున్నాం.. నువ్వొచ్చి మాకు నీతులు చెప్తే మేం ఏం చేయాలి. ఇక బీజేపోళ్లు ఉత్తరప్రదేశ్ నుంచి ఊపుకుంటూ వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడిపోతరు. అక్కడి కూలీలు మన వద్దకు వచ్చి నాట్లు వేసి పోతున్నరు. దేశంలోని 14 రాష్ర్టాల నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నరు. అది కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెల్వక ఏదో అడ్డం పొడుగు మాట్లా డుతరు.
నెహ్రూ ఆనాడే దళిత బంధు స్కీం ప్రారంభిస్తే.. ఇప్పుడు దళితులకు ఈ పరిస్థితి ఉండేదా.? అప్పటినుంచి దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్పా.. ఏం చేయలేదని ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. గురువారం ధర్మపురి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్, బాల్కొండ నియోజకవర్గంలో వేముల ప్రశాంత్ రెడ్డి, నిర్మల్ నియోజకవర్గంలో ఇంద్రకరణ్రెడ్డిలకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించారు. దేశంలోనే తొలిసారిగా దళితబంధు, రైతుబంధు పుట్టించిన పార్టీ బీఆర్ఎస్.. అటు రైతుల ముఖాలు.. ఇటు దళితుల ముఖాలు తెల్లబడేలా చేస్తున్నాం.
రైతు రుణమాఫీ చేశాం. కాంగ్రెస్ నేతల ఫిటిషన్తో ఆగిపోయింది. ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇస్తే.. వారం, పది రోజుల్లో అందరికీ మాఫీ అవుతుంది. రైతు బంధును రేవంత్ రెడ్డి బిచ్చమేస్తున్నారు అంటాడు.. 24 గంటల కరెంటు వద్దు 3 గంటలు చాలంటాడు. ధరణి పోర్టల్ వద్దంటాడు.. దేశానికి అన్నం పెట్టే రైతులు మీకు బిచ్చగాళ్ల లాగా కనబడుతున్నారా.? ధరణి తీసేస్తే.. రైతు బంధు ఎలా పడుతుంది.. పంట డబ్బులు ఎలా పడుతాయి.. రైతు బీమా ఎలా వస్తది.. ధరణి తీసేసి.. మళ్లీ దళారి వ్యవస్థను తీసుకొచ్చి.. దోచుకోవాలని చూస్తున్నరు. వారికి రైతులు బాగు పడటం ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీకి 11, 12 సార్లు అధికారం ఇచ్చాం.
ఏం చేశారని.. ఇప్పుడు మళ్లీ ఒక్కసారి అంటున్నరు.. ఎందుకు ఇవ్వాలి.. పచ్చబడిన తెలంగాణను కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లు పంటికంటకుండా మింగుదామని చూస్తున్నరు. అన్నదమ్ముళ్లు.. అక్క చెల్లెల్లకు దండంపెట్టి చెబుతున్నా.. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ప్రజల కోసం. హక్కులు, నీళ్లు, నిధులు, నియామకాల కోసం. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
ఎన్నికల తర్వాత ఐదు వేల పెన్షన్ రాబోతున్నది.. మీ ఒక్క ఓటు కూడా ఇంకో పార్టీకి పడొద్దు. నేను చెప్పే నాలుగుమాటలపై గ్రామాల్లో చర్చ పెట్టాలి.. ఏది నిజమో కాదో తేల్చాలి. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి ఓటేస్తే.. మన రాష్టం ఆగమాగం అయిపోతది. ఓటు చాలా విలువైనది. దాని ప్రభావం ఐదేండ్ల భవిష్యత్పై ఉంటది.. కాబట్టి జాగ్రత్తగా వాడాలి.