కీసర : సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల అమలుతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదన్నారు. జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, ఎంపీడీవో పద్మావతి, ఎంపీవో మంగతాయారు, వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిర , సర్పంచులు మాధురి వెంకటేశ్, రాజుముదిరాజ్, ఆండాలుమల్లేశ్, విమలనాగరాజు, మహేందర్రెడ్డి, ఎంపీటీసీ నారాయణశర్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నారాయణ, నాయకులు పాల్గొన్నారు.