హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): వినాయక చవితిని సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్లో ఘనంగా నిర్వహించారు.
వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, శోభ దంపతులు గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు తదితరులు పాల్గొన్నారు.