ఆర్కేపురం : ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని సరూర్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్రెడ్డి అన్నారు. సరూర్నగర్ డివిజన్ అంబేద్కర్నగర్కు చెందిన జంగం ప్రభాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.
దీంతో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నాడు. అందుకుగాను పెద్ద మొత్తంలో ఖర్చు అవ్వడంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులను సంప్రదించగా సీఎం సహాయనిధికి దరఖాస్తు చేయించారు. సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన రూ.42500 రూపాయల చెక్కును సోమవారం అనితారెడ్డి, బేర బాలకిషన్తో కలిసి బాధితునికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య ఖర్చుకోసం ఇస్తున్న సీఎం సహాయనిధిని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో బేర బాలకిషన్, లోడి నర్సింహాగౌడ్, సుదర్శన్, రిషి, కడారి యాదయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.