మేడ్చల్, ఫిబ్రవరి25(నమస్తే తెలంగాణ)/మేడ్చల్ కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 59 జీవో దరఖాస్తులను పెండింగ్లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం 59 జీవో, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం,మన ఊరు-మన బడి పై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారిని గుర్తించి క్రమబద్ధీకరణకు నోటీసులు అందించాలన్నారు. ముగింపు దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు, మన ఊరు-మన బడి పనుఉ త్వరగా పూర్తి చేయాలని అధికారును ఆదేశించారు. జిల్లాలో 176 పాఠశాలలను మన ఊరు-మన బడి కార్యక్రమానికి ఎంపిక చేశామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడికి నిధుల కొరత లేదని పర్యవేక్షణ లోపంలోనే ఆలస్యం జగుతుందని, అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగ్యస్త, జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, పంచాయితీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంమోహన్రావు, తదితరులు పాల్గొన్నారు.