బొల్లారం,ఆగస్టు 11 : హైదరాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 13న నిర్వహించనున్న ప్రతిష్టాత్మక లేజర్ క్లాస్ సెయిలింగ్ చాంఫియన్ షిప్ పోటీల ప్రారంభోత్సవాలను పురస్కరించుకొని బుధవారం హుస్సేన్ సాగర్లో క్లీన్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంసీఈఎంఈ లెఫ్టెనెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణన్, సినీ నటుడు సుధీర్ బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీఎస్ఏ నారాయణన్ మాట్లాడుతూ..ప్రతి ఏడాది నగరంలో రక్షణ శాఖ కు చెందిన ఎంసీఈఎంఈ ఆధ్వర్యంలో సెయిలింగ్ పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెయిలింగ్ క్రీడాకారులు పాల్గొంటారని, దానిలో భాగంగానే క్లీన్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టిన్నట్లు పేర్కొన్నారు.