హైదరాబాద్ : భూ వివాదంలో(Land dispute) అన్నదమ్ముల మధ్య ఘర్షణ(Clash between brothers) చోటు చేసుకుంది. పరస్పరం కర్రలతో దాడికి పాల్పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా(Medchal district) మైసిరెడ్డిపల్లిలో గురువారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.