సివిల్స్ 28వ ర్యాంకర్ మౌర్య భరద్వాజ్
చిక్కడపల్లి, జూన్ 6: అపజయాలకు క్రుంగిపోకుండా ఆ అనుభవం నుం చే విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని సివి ల్స్ 28వ ర్యాంకర్ మౌర్య భరద్వాజ్ సివిల్స్ అభ్యర్థులకు సూచించారు. అశోక్నగర్లోని సోసిన్ క్లాసెస్ సివి ల్స్ అకాడమీలో సివిల్స్ అభ్యర్థుల కోసం సోమవారం అవగాహ న సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ తాను ఐదోసారి సివిల్స్ సాధించానని, పరీక్షలప్పుడు పొరపాట్లపై దృష్టి పెట్టాలన్నారు. ఈ రెండేండ్ల నుంచి ఉద్యోగం చేసుకుంటూనే సివిల్స్ ప్రిపేర్ అ య్యానని వివరించారు. విధులో చేరగానే గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెడుతానని తెలిపారు. సోసిన్ క్లాసెస్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ సోసిన్ రేవెళ్ల అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.