మాదాపూర్, డిసెంబర్ 8: నేత కార్మికులకు ప్రతి ఒక్కరూ చేయూతగా నిలవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన గ్లామ్ పరిక్రమ లగ్జరీ ఎగ్జిబిషన్కు ముఖ్య అతిథిగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హాజరై ఆయూష్ డైరెక్టర్ హరిచందన, జేఎన్ఏఎఫ్ఏయూ వీసీ కవితా దర్యానీరావు, వీ హబ్ సీఈవో దీప్తీ రావుల, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ చైర్ పర్సన్ అనురాధా బిష్ణోయ్, ఫిక్కీ ఫ్లో హైదరాబాద్ ఛాప్టర్ రీతూ షా, ఐఐఐడీ చైర్ పర్సన్ పల్లవి అంచూరి, ఇంటీయిర్ డిజైనర్, కడనీ ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకురాలు సుప్రజా రావు, మిసెస్ ఇండియా తెలంగాణ 2023 విజేత రాను శర్మలతో పాటు నిర్వాహకురాలు సోనా చెట్వానీతో కలిసి శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ … నేత కార్మికులను చేయూతగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. మహిళల మనసును దోచే అన్ని రకాల ఫ్యాషన్ ఉత్పత్తులు ప్రదర్శనలో కొలువుదీరడం సంతోషంగా ఉందన్నారు. కాగా, ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 150కి పైగా స్టాళ్లను ప్రదర్శించగా, స్టాల్స్లో పోచంపల్లి, గద్వాల్, కంచి, ఇక్కత్ వస్ర్తాలతో పాటు పలు రకాల డ్రెస్ మెటీరియల్స్, గృహోపకరణ ఉత్పత్తులు, చేతితో తయారు చేసిన ఉత్పత్తులతో పాటు దేశంలోని పలు ప్రముఖ నగరాల విచ్చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇందులో భాగంగా తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ వారు 5 స్టాళ్లను ఏర్పాటు చేశారు.