చార్మినార్, సెప్టెంబర్ 23 : వందేండ్లకు పైగా విద్యనందిస్తూ ఎందరికో దిక్సూచిగా నిలించింది సిటీ కళాశాల. ఘనమైన చరిత్రతో ముందుకు సాగుతున్నది. ఇప్పుడు శత వసంతాల వేడుకలను నిర్వహించుకునేందుకు ముస్తాబవుతుంది. సిటీ కళాశాల ప్రస్తానం మొదలై శత వసంతాలు పూర్తికావస్తున్న నేపథ్యంలో వందేండ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలభాస్కర్ తెలిపారు. సిటీ కాలేజీలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవలే అటానమస్ కాలేజీగా మరోసారి గుర్తింపు సాధించిన సిటీ కాలేజీలో వివిధ కోర్సుల్లో అభ్యసించడానికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. శత వసంతాల ఉత్సవాలను ఈనెల 29వ తేదీన ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఉప ప్రిన్సిపాళ్లు శుక్లా, అయేషా సుల్తానా, అధ్యాపకులు దయానంద్, నీరజ, శ్రావణ్, పావనీ తదితరులు పాల్గొన్నారు.