చిక్కడపల్లి, జూన్16 : ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకే వెళ్తున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులతో సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తున్నామని చెప్పారు. గురువారం గాంధీనగర్ డివిజన్ పరిధిలోని చిక్కడపల్లి సుధా హోటల్ పక్క వీధిలో హెచ్ఎస్ఆర్ వసుధ అపార్ట్మెంట్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎమ్మెల్యే కేర్స్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్(ట్యాక్స్)జాకీర్ హుస్సేన్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ పావని, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ దేవేందర్, బిల్ కలెక్టర్ సత్యనారాయణ, వాటర్వర్క్స్ డీజీఎం చంద్రశేకర్, మేనేజర్ వేణుగోపాల్ నాయకుడు , అశోక్ నగర్ విద్యుత్ శాఖ ఏఈ పవన్, చిక్కడపల్లి ఎస్ఐ నాగరాజు తదితరులతో కలిసి సమావేశంలలో పాలల్లొన్నారు.
అపార్ట్మెంట్ వాసులు చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్నా అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లో ఉన్న అపార్ట్మెంట్లల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అపార్ట్మెంట్ వాసుల సమస్యలు పరిష్కారం కోసం ఇటీవల ‘ఎమ్మెల్యే కేర్’ కార్యక్రమానికి ప్రారంభించడం జరిగిందని అన్నా రు. యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, ముచ్చకుర్తి ప్రభాకర్, డివిజన్ అధ్యక్షుడు ఎం. రాఖేశ్, గుండు జగదీశ్ బాబు, మారిశెట్టి నర్సింగ్ రావు, రవి శంకర్గుప్తా, ఎస్టీ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.