బడంగ్పేట, ఫిబ్రవరి 11: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంలాంటిదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ నందిహిల్స్ రోడ్ నం.7లో నివాసముంటున్న మల్లారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ గత కొన్ని నెలల క్రితం ఓ ప్రైవేట్ దవాఖానలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. పేదరికం కారణంగా అధికఖర్చు భరించలేక 9వ డివిజన్ ఇన్చార్జి రామిడి నర్సిరెడ్డిని సంప్రదించి సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. మంజూరైన రూ.32,500 చెక్కును మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ ఇన్చార్జి రామిడి నర్సిరెడ్డి, కుటుంబ సభ్యుడు కోటిరెడ్డి పాల్గొన్నారు.
పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పులిమామిడి చీకటి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల15 నుంచి 17 వరకు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మంత్రిని ఆహ్వానించి వాల్ పోస్టర్ను విడుదల చేయించారు. కార్యక్రమంలో నాయకులు దామోదర్గౌడ్, శ్రీనివాస్, పాండురంగారెడ్డి, ఉప సర్పంచ్ వెంకటాచారి, శేఖర్, అశోక్, యాదయ్య, రాంరెడ్డి పాల్గొన్నారు.