బండ్లగూడ : అన్ని వర్గాల వారి సంక్షేమమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.గురువారం ఆయన పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన చెక్కులను అందజేశారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన వెంకట దుర్గాభవానికి రెండు లక్షల యాబై వేల చెక్కు, నారయణ స్వామికి 60 వేల చెక్కు, ఆశప్పకు 56వేల చెక్కు, విద్యావతి 30వేల చెక్కు, కైసర్ సుల్తానాకు 60వేల చెక్కులను అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు.
రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేందర్రెడ్డి. కార్పొరేటర్ చంద్రశేఖర్, సాగర్గౌడ్, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేష్గౌడ్, నాయకులు పాపయ్యయాదవ్, నదీం, సదానంద్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.