గులాబీ సైనికులం అని ఇంతకాలం చెప్పుకు తిరిగిన నేతలంతా కండువాలు మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆశించి చేవెళ్ల ఎంపీ టికెట్పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఆమెకే టికెట్ కన్ఫర్మ్ అనుకునేంతలోనే కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అభ్యర్థి గెలుపు కోసం నేతలంతా కలిసికట్టుగా పనిచేసే పరిస్థితిపైనే ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతల మధ్య సమన్వయం కుదురుతుందా.. పాత, కొత్త పార్టీ కార్యకర్తలంతా కలిసిపోయి పనిచేస్తారా? అన్నది కోటి డాలర్ ప్రశ్నగా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
-రంగారెడ్డి, మార్చి 22 (నమస్తే తెలంగాణ)
Congress | చేవెళ్ల ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సంకల్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్కు సొంత అభ్యర్థిని నిలబెట్టుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డికి గాలం వేసింది. అంతకుముందే ఈ ఎంపీ స్థానాన్ని ఆశించిన పట్నం సునీతామహేందర్రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. కానీ.. అనూహ్యంగా రంజిత్రెడ్డికి పార్టీలో చేరిన కొద్ది రోజులకే కాంగ్రెస్ టికెట్ను ఖరారు చేసింది. రంజిత్రెడ్డి ఢిల్లీ స్థాయిలో చేసిన లాబీయింగ్ వల్లే టికెట్ను కైవసం చేసుకున్నట్లు తెలుస్తున్నది.
చేవెళ్ల ఎంపీ టికెట్ను రంజిత్రెడ్డికి కేటాయించడం అనూహ్యంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కోసం అన్వేషణ మొదలు పెట్టక ముందే పట్నం సునీతారెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఫిబ్రవరిలో చేవెళ్లలో భారీ బహిరంగ సభను నిర్వహించగా.. ఆ వేదికపైనే సునీతారెడ్డి పేరును ప్రకటిస్తారని అందరూ భావించారు. అలా.. అనేక సందర్భాల్లోనూ ఆమె అభ్యర్థిత్వంపై ప్రకటన వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల క్రమంలో సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి పార్టీలో చేరారు. మొదటి నుంచీ టికెట్ ఆశించిన సునీతారెడ్డిని కాదని ఆ తర్వాత పార్టీలో చేరిన రంజిత్రెడ్డికే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. చేవెళ్ల టికెట్ ఆశించిన సునీతకు కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ చివరలో ఇచ్చిన ట్విస్ట్ పట్నం కుటుంబీకులకు ఒకింత నైరాశ్యం కలిగించేదే.
చేవెళ్ల ఎంపీ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీఆర్ఎస్ నాలుగు స్థానాలను, కాంగ్రెస్ మూడు స్థానాలను గెలుచుకున్నాయి. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం లక్ష దాకా ఉండగా.. ఒకింత బీఆర్ఎస్కే ఎక్కువ అనుకూలత ఉన్నది. ఎంపీ రంజిత్రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడంతో బలాబలాలు మారుతాయని కాంగ్రెస్ భావిస్తున్నది. అయితే కొత్త.. పాత నేతల మధ్య సమన్వయం కుదురుతుందా? అనేది కాంగ్రెస్ పార్టీతో పాటు పొలిటికల్ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. టికెట్ చేజారడంతో ఒకింత నైరాశ్యంలో ఉన్న పట్నం వర్గీయుల నుంచి రంజిత్రెడ్డికి సహకారం అందేది సందేహాస్పదమే అవుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.