హైదరాబాద్ : సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని కస్తూర్బా కాలేజీలో విష వాయువులు లీక్ అయ్యాయి. ఇంటర్ బ్లాక్లోని కెమిస్ట్రీ ల్యాబ్లో విద్యార్థినులు ప్రాక్టికల్స్ చేస్తుండగా.. విష వాయువులు లీక్ అయ్యాయి. దీంతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 10 మంది విద్యార్థినులు స్పృహ కోల్పోయారు. దీంతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమైంది. బాధిత విద్యార్థినులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.